News February 9, 2025

డోన్: విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి

image

కూలి పనుల కోసం రేకుల షెడ్డు నిర్మాణానికి వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన విషాదకర సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. సుందర్ సింగ్ కాలనీకి చెందిన ఖాజాబాషా(32) కొత్తపల్లి గ్రామ సమీపంలో రేకుల షెడ్డు నిర్మాణానికి కూలి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా పైభాగంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

Similar News

News February 10, 2025

అనంతపురంలో భారీ చోరీ.. ధార్ గ్యాంగ్‌ అరెస్ట్

image

అనంతపురం శ్రీనగర్ శివారు కాలనీలో 18 రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల ధార్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 59 తులాల ఆభరణాలు, రూ.19.35లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిపై పలు రాష్ట్రాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.

News February 10, 2025

చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..

image

సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.

News February 10, 2025

చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..

image

సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.

error: Content is protected !!