News January 21, 2026
డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి రూ.1.30 లక్షలు ఫైన్: పార్వతీపురం SP

పార్వతీపురం మన్యం జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 13మందిని అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోసెఫ్ ముందు హాజరు పరిచినట్లు ఎస్పీ మాధవరెడ్డి మంగళవారం తెలిపారు. పార్వతీపురం పట్టణ ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.30 లక్షలను జరిమానా విధించారని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News February 20, 2026
NTR: వీరికి కావాలి ఉపశమనం..!

విజయవాడ కమిషనరేట్ పరిధిలో VIPల రాకతోపాటు రెండ్రోజులకు ఓ ఈవెంట్ నిర్వహించడంతో పోలీసులపై పని భారం పెరిగింది. గతేడాది దసరా ఉత్సవాలు మొదలు.. నెలకు ఒకటి రెండు ఈవెంట్స్తోపాటు రాష్ట్ర కార్యక్రమాలు, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన, బందోబస్తులతో కింది స్థాయి సిబ్బంది నుంచి.. SHOల వరకు భారం ఉంటోంది. ట్రాఫిక్ పోలీసులు ఐతే అన్ని రకాల డ్యూటీలు చేస్తున్నారు. దీంతో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
News February 20, 2026
వనపర్తి: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శుభవార్త

వివిధ దశల్లో నిర్మాణాలు ఉండి ఇందిరమ్మ బిల్లులు మంజూరి నిలిచిపోయిన ప్రతి ఒక్కరికి బేస్ మెట్ లెవెల్ ఖర్చు మినహాయించి ఆ పైన ఉన్న నిర్మాణాలకు సంబంధించి బిల్లులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం GO RT NO 96 జారీ చేసింది. దీంతో పలు దశలో ఉన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలన్నింటినీ ఆయా దశలను బట్టి బిల్లులు మంజూరు అవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
News February 20, 2026
పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.


