News December 21, 2025

డ్రగ్స్ దేశ భద్రతకే ముప్పు: ఆకే రవికృష్ణ

image

డ్రగ్స్ వినియోగం కేవలం ఆరోగ్యానికే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పు అని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన ‘రోటోఫెస్ట్-2025’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల కదలికలపై అనుమానం వస్తే వెంటనే 1972 నంబర్‌కు సమాచారం అందించాలని ఐజీ పిలుపునిచ్చారు.

Similar News

News December 23, 2025

GNT: డీజీపీ కమెండేషన్ డిస్క్‌లకు ఎంపికైన పోలీస్ అధికారులు

image

ఏపీ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ అధికారులకు 2025 సంవత్సరానికి గాను డీజీపీ కమెండేషన్ డిస్క్‌లను ప్రకటించారు. ఈ అవార్డులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విభాగాల్లో అందజేస్తారు. సిల్వర్ డిస్క్ విభాగంలో ASP(అడ్మిన్) జి. వెంకట రమణ మూర్తి, తాడికొండ సీఐ కె. వాసు, చేబ్రోలు పోలీస్ ఏఎస్సై–(2260) యు. శ్రీనివాసరావు ఎంపికయ్యారు. అటు బ్రాంజ్ మెడల్ విభాగంలో మరో 20 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు.

News December 22, 2025

వక్ఫ్ భూముల్లో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో వక్ఫ్ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటుకు వక్ఫ్ బోర్డు, సర్వే, రెవిన్యూ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వక్ఫ్ భూములను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సర్వే జరిగేలా చూడాలన్నారు.

News December 22, 2025

వినియోగదారుల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

జాతీయ వినియోగదారుల వారోత్సవాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్, వివిధ రంగుల్లో ఉండే గుర్తులను ఎలా గమనించాలి, ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు.