News April 12, 2025

డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి: కలెక్టర్

image

మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని సమాజానికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేటలో ఎక్సైజ్, విద్యాశాఖ, జిల్లా సంక్షేమ, వ్యవసాయ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో మాదకద్రవ్య నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలన్నారు.

Similar News

News July 9, 2025

కామారెడ్డి: రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

image

KMR జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. KMR జిల్లాలో గతేడాది 3,16,242 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 3,18,530 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి గతేడాది 34,459 ఎకరాల్లో పండించగా ఈ ఏడాది 34,549 ఎకరాల్లో పండించవచ్చని పేర్కొన్నారు.

News July 9, 2025

రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డి.ఇ.ఓ. కె.వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్‌లో చేరారు. వీరికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి మహాలక్ష్మికి అందజేశారు.

News July 9, 2025

మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.