News October 15, 2025
డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యం: నారాయణపేట ఎస్పీ

జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తామని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కమ్యూనల్ గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, గ్రామాలు, పట్టణాల్లో పెట్రోలింగ్ పెంచుతామన్నారు. సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు.
Similar News
News October 16, 2025
నేటి ముఖ్యాంశాలు

❁ రేపు ఏపీకి ప్రధాని.. ₹13వేల కోట్ల పనులకు శ్రీకారం
❁ నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CM CBN
❁ ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం: లోకేశ్
❁ TG: ఓట్ల చోరీతో గెలిచింది బీఆర్ఎస్సే: శ్రీధర్ బాబు
❁ మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్
❁ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి
❁ ఈ నెల 18న బంద్.. మద్దతు తెలిపిన BRS, BJP
❁ MH సీఎం ఫడణవీస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్
News October 16, 2025
నారాయణపేట: హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్: ఎస్ఐ

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన రుక్కమూల నరసింహులుపై కత్తితో దాడి చేసిన జంజర్ల నరేశ్(25)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 10వ తేదీన “తన కూతురితో ఎందుకు మాట్లాడుతున్నావు” అని నరసింహులు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని జిల్లా జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు SI రమేశ్ తెలిపారు.
News October 16, 2025
వనపర్తిలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

వనపర్తిలోని ఓ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లాకు చెందిన పోతులపాడు సంజీవ (16) వనపర్తిలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈనెల 10న మధ్యాహ్నం కాలేజీ నుంచి ఆ విద్యార్థి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.