News February 9, 2025
డ్రామాలో బుడాన్ ఖాన్ కేసీఆర్: ఎంపీ రఘునందన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739100228351_50139766-normal-WIFI.webp)
డ్రామాలో బుడాన్ ఖాన్ కథ లెక్క కేసీఆర్ తీరు ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. బీజేపీ బలపర్చిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులున్నారు.
Similar News
News February 10, 2025
మెదక్ జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739167464570_50139766-normal-WIFI.webp)
ఫోరం అఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మెదక్ జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ సోమవారం నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ – 2025 క్యూఆర్ కోడ్ ద్వారా ప్రశ్నపత్రం FPST సభ్యులు విడుదల చేశారు. మెదక్ జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతినిధులు దయానంద రెడ్డి ప్రభు, అశోక్, నాగేందర్ బాబు, దశరథం నూకల శ్రీనివాస్, కృష్ణ, మల్లారెడ్డి, మహిళా ప్రతినిధులు రజిని, నాగలత మమత, రమేష్ చౌదరి తదితరులున్నారు.
News February 10, 2025
MDK: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739172443469_1243-normal-WIFI.webp)
మెదక్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా నర్సాపూర్ మండలంలో 35.5, వెల్దుర్తి 34.1, నిజాంపేట 33.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News February 10, 2025
MDK: రేపు ముసాయిదా జాబితా విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739164494165_1243-normal-WIFI.webp)
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. MDK జిల్లాలో 21 ZPTCలు, 190 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.