News December 3, 2025

డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

image

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 9, 2026

విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

image

ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం, ఆస్తి వివాదాలు, లోన్ మోసాలు, కుటుంబ సమస్యలు వంటి ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News March 9, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 157 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 157 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 12,967 మంది విద్యార్థులకు గానూ 12,810 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

News March 9, 2026

కర్నూలు: నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ఈనెల 9న ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమస్త ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు.