News March 5, 2025

డ్రోన్స్ పర్యవేక్షణలో ప్రశాంతంగా అమ్మవారి జాతర: SP

image

చీపురుపల్లిలో జరిగిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరను డ్రోన్స్ పర్యవేక్షణ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశామన్నారు. భక్తులు సులభతరంగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడం, త్వరితగతిన భక్తులను వరుస క్రమంలో పంపేటట్లు బందోబస్తు నిర్వహించామన్నారు.

Similar News

News September 19, 2025

తెర్లాం: తండ్రిని చంపిన కసాయి కొడుకు

image

క్షణికావేశంలో కన్న తండ్రినే చంపాడు కసాయి కొడుకు. తెర్లాం (M) ఎంఆర్.అగ్రహారానికి చెందిన అప్పలస్వామికి ఇద్దరు కొడుకులు. తన గురించి ఊరంతా చెడుగా చెబుతున్నాడంటూ చిన్న కుమారుడు శంకరరావు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలోనే కోపంలో రాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అప్పలస్వామిని మనవరాలు కల్పన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 19, 2025

VZM: రానున్న 20 రోజులు ఎరువుల సరఫరా కీలకం: కలెక్టర్

image

రానున్న 20 రోజులు ఎరువులు సరఫరా కీలకమని మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఎరువులు లభ్యత, సరఫరాపై మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి వారి వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తక్షణ అవసరం ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయాలన్నారు.

News September 19, 2025

DSP శ్రీనివాసరావుకు బదిలీ

image

VZM సబ్ డివిజన్ DSP శ్రీనివాసరావును వీఆర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ విభాగం, పోలీస్‌ ఉన్నతాధికారులు DSPవ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమెన్ PS DSPగా పనిచేస్తున్న గోవిందరావుకు ఇన్‌ఛార్జ్ DSPగా బాధ్యతలు అప్పగించారు.