News December 24, 2025

ఢిల్లీలో ఉంటే అలర్జీలు వస్తున్నాయి: నితిన్‌ గడ్కరీ

image

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. “ఢిల్లీలో 3 రోజులు ఉంటేనే నాకు అలర్జీలు వస్తున్నాయి” అని అన్నారు. ఢిల్లీ-NCR (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలో కాలుష్యంలో 40% రవాణా రంగం నుంచే వస్తోందని వెల్లడించారు. ఢిల్లీకి వచ్చే ప్రతిసారీ వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తానని, పొల్యూషన్ భయంకరంగా ఉందన్నారు.

Similar News

News December 25, 2025

దేశంలో లక్షకు పైగా పెట్రోల్ పంప్స్

image

ఇండియా ఇంధన రిటైల్ మార్కెట్ చైనా, US తరువాత 3వ స్థానాన్ని ఆక్రమించింది. పదేళ్లలో అవుట్‌లెట్‌లు రెట్టింపై 1,00,266కు చేరాయి. ఇందులో 29% రూరల్ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతున్నాయని IOL మాజీ ఛైర్మన్ అశోక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ సహా CNG, EV ఛార్జింగ్ స్టేషన్స్ వంటివీ అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ అంశంలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం 10% లోపే ఉంది.

News December 25, 2025

రోజుకు 4.08 లక్షల లడ్డూల పంపిణీ: TTD ఛైర్మన్

image

AP: DEC 30 నుంచి ఆరంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలు, 8వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో వీటి తయారీని పెంచుతాం. లడ్డూల నాణ్యత, రుచి పెంచాం, క్యూలైన్లలో నిరీక్షణ తగ్గించాం’ అని పేర్కొన్నారు. ఆయన లడ్డూ తయారీ, విక్రయ కేంద్రాన్ని పరిశీలించి భక్తులతో మాట్లాడారు.

News December 25, 2025

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు అలర్ట్

image

TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మందు కొట్టి విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలతో తిరిగే వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు వెహికల్ సీజ్, గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో 304 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Share it