News February 15, 2026
ఢిల్లీలో ఫిర్యాదు.. వరంగల్లో దర్యాప్తు..!

నర్సంపేట(M) లక్నేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో పలువురిని మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీకి చెందిన ఓ వృద్ధ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ మోసపు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితురాలి చిన్న కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని కీలక అంశాలు బయటికి వస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 17, 2026
‘జై హనుమాన్’లో కదలిక.. షూటింగ్కి రెడీ!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో ‘జై హనుమాన్’ను 2024 అక్టోబర్లో <<14492400>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ నెల 22న మూవీ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని హంపికి దగ్గర్లో హనుమాన్హల్లిలోని అంజనాద్రి హిల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పాయి. 2024లో రిలీజైన హనుమాన్కు సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కనుంది. ఆంజనేయుడిగా రిషబ్ కనిపించనున్నారు.
News February 17, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 17, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 17, 2026
రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ పట్టణాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరం చుట్టూ రూ.700 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.


