News August 13, 2025

ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు కామారెడ్డి మహిళలు

image

ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కామారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు మహిళా స్వయం సహాయక సంఘం ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లక్ పతి దీదీ పథకం కింద రాష్ట్రం నుంచి ఐదుగురు మహిళలకు ఈ అవకాశం లభించగా, వారిలో ముగ్గురు కామారెడ్డి జిల్లా వారే కావడం విశేషం. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వారిని అభినందించారు.

Similar News

News August 13, 2025

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

image

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. బుధవారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 కాగా.. 145.64 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 20.175 టీఎంసీలకు 13.7124గా ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 1,1374 క్యూసెక్కుల వరద ఎల్లంపల్లికి చేరుతోంది. దిగువకు 451 క్యూసెక్కులు వదులుతున్నారు.

News August 13, 2025

కడెం: 3 గేట్ల ద్వారా నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరగడంతో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టులోకి 40,066 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎడమ కాలువకు 384, కుడి కాలువకు 20, మిషన్ భగీరథకు 9, దిగువకు 17,601 క్యూసెక్కులు వదులుతున్నారు.

News August 13, 2025

అల్లూరి: యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

image

యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం పాడేరులో కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మేరకు, ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రెండు వారాల పాటు జరుపుకోవాలని తెలియజేశారు.