News April 12, 2025
ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు:BRS

వరంగల్లో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ రజజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని.. ఢిల్లీ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కేసిఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.
Similar News
News April 12, 2025
గ్యాస్ సబ్సిడీ జమ కాలేదా?

AP: ఆధార్/రేషన్కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ కాకపోవడంతో పలువురికి దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందడం లేదు. మార్చి 31 నాటికి దాదాపు 14వేల మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు అకౌంట్లో జమ కాలేదు. దీంతో ప్రజలు ఏజెన్సీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్లో దీపం-2 డ్యాష్బోర్డును సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
News April 12, 2025
దీపం-2 డ్యాష్బోర్డు ఎలా పనిచేస్తుంది?

✒ https://epds2.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీపం-2 డ్యాష్ బోర్డు కనిపిస్తుంది.
✒ KNOW YOUR DEEPAM2 STATUSపై క్లిక్ చేసి రేషన్ కార్డు లేదా ఎల్పీజీ నంబర్ ఎంటర్ చేయాలి.
✒ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే దీపం-2 ఎలిజిబిలిటీ స్టేటస్, సబ్సిడీ జమ వివరాలు కనిపిస్తాయి.
✒ ఏదైనా సమస్య ఉంటే దానికి గల కారణాలు తెలుస్తాయి.
✒ NOTE: ఈ డ్యాష్బోర్డు అందుబాటులోకి వచ్చాక ఆప్షన్లు కనిపిస్తాయి.
News April 12, 2025
నరసరావుపేట: ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక సూచన

పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.