News March 16, 2026
ఢిల్లీ పార్లమెంట్లో ‘సేవ్ ఆర్డీటీ’ నినాదాలు

ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో వైసీపీ ఎంపీలు, ముఖ్య నేతలు ‘SAVE RDT’ పోస్టల్ కార్డులతో నిరసన తెలిపారు. ఆర్డీటీ సంస్థను కాపాడాలంటూ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మల్లికార్జున రెడ్డి, తనుజ తదితరులు నినాదాలు చేశారు. పేదలకు సేవలందిస్తున్న సంస్థపై వేధింపులు ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్సీఏను కేంద్రం పునరుద్ధరించాలని కోరారు.
Similar News
News March 26, 2026
జిల్లా కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నేడు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలులో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా నియోజకవర్గంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, దేవాలయాల అభివృద్ధి పనులకు తగిన గ్రాంట్లు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.
News March 26, 2026
సంగారెడ్డి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రావీణ్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ప్రొఫైల్ నమోదు, డేటా ఎంట్రీ తదితర వివరాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
News March 26, 2026
EVM, VVప్యాట్ల గోదాముల్లో కలెక్టర్ పరిశీలన

EVM, VVప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికి నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను కలెక్టర్ లక్ష్మీశ అదేశించారు. గురువారం గొల్లపూడిలోని EVM, VVప్యాట్ల గోదామును పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు.


