News November 11, 2025
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై NIA అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
Similar News
News November 11, 2025
యాపిల్ కొత్త ఫీచర్.. నెట్వర్క్ లేకున్నా మ్యాప్స్, మెసేజెస్!

మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేకున్నా మ్యాప్స్, మెసేజ్లు పనిచేసే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని బ్లూమ్బర్గ్ ఒక రిపోర్టులో తెలిపింది. యాపిల్కు చెందిన ఇంటర్నల్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ ఇప్పటికే గ్లోబల్స్టార్ నెట్వర్క్తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ ద్వారా పనిచేసే ఎమర్జెన్సీ SOS ఫీచర్ను 2022లో విడుదల చేసిన iPhone14లోనే అందుబాటులోకి తెచ్చింది.
News November 11, 2025
థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు. ✍️ మరింత ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 11, 2025
ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.


