News November 11, 2025

ఢిల్లీ పేలుళ్లు.. అర్ధరాత్రి వరంగల్‌లో ముమ్మర తనిఖీలు

image

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం అర్ధరాత్రి ట్రై సిటీ పరిధిలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు.

Similar News

News November 11, 2025

భద్రాద్రి రామయ్యతో అందెశ్రీకి ప్రత్యేక అనుబంధం

image

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. కొత్తగూడెంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాలోత్సవ్‌‌కు పలుమార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం, పాడిన పాటలను స్మరించుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసరాల్లో ఏప్రాంతానికి వచ్చిన గోదావరిలో స్నానం చేసి రామయ్యను దర్శనం చేసుకునేవారని గుర్తు చేసున్నారు.

News November 11, 2025

అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం

image

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నెలనెల వెన్నెల 65వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాయమైపోతున్న మనిషి విలువల గురించి చేసిన ప్రసంగం, పాడిన పాటను పలువురు నెమరేసుకున్నారు. అందెశ్రీ మృతికి నెలనెల వెన్నెల నిర్వాహకులు సంతాపం తెలిపారు. అందెశ్రీ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.

News November 11, 2025

ఖమ్మంలో కొత్త రేషన్ కార్డుల జోరు

image

పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. జనవరి నాటి 4,11,143 కార్డులకు అదనంగా 52,406 కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 4,63,549కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత సన్న బియ్యం పంపిణీ జరగడంతో కొత్తగా లబ్ధి పొందుతున్న వారికి ఉపశమనం లభించింది.