News February 28, 2026
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. జడ్జి జస్టిస్ జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు

* అప్రూవర్ వాంగ్మూలాన్నే నిజంగా భావించి పరిశీలన లేకుండానే కేసు పెట్టారు.
* సాక్ష్యాధారాలు లేకపోయినా ఊహాగానాలతో <<19251338>>కేసును<<>> నిర్మించారు.
* PMLAలో కఠిన నిబంధనల వల్ల వాస్తవాలను పరీక్షించకముందే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల వ్యక్తుల స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది.
* దర్యాప్తు లోపాలపై కోర్టు మౌనంగా ఉండటమంటే విధి నిర్వహణ నుంచి తప్పుకోవడమే.
* ఆకాశం కూలినా సరే న్యాయం జరగాల్సిందే.
Similar News
News February 28, 2026
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు – నివారణ

బొగ్గు కుళ్లు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంటవేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూతదశ నుంచి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పద్ధతిని అనుసరించాలి.
News February 28, 2026
AIIMS న్యూఢిల్లీలో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్

AIIMS-CAPFIMS న్యూఢిల్లీ 100 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DNB/DrNB, MD/MS/DM/MCh అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.aiims.edu/
News February 28, 2026
దేశంలోనే రాష్ట్రం నంబర్-1.. రూ.422 కోట్లు మంజూరు

ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే నంబర్-1గా నిలిచింది. రాష్ట్రంలో 73.82 లక్షల మంది పట్టాదారులుండగా కేంద్రం 39.77 లక్షల మంది రైతుల నమోదును లక్ష్యంగా నిర్దేశించింది. అయితే రాష్ట్రం రికార్డు స్థాయిలో 43.59 లక్షల మందిని(110 శాతం) నమోదు చేసింది. ఇందుకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.422 కోట్లను విడుదల చేసింది.


