News July 10, 2025
ఢిల్లీ వెళ్లిన అనకాపల్లి కలెక్టర్

జల్ జీవన్ మిషన్పై ఢిల్లీలో నేడు జాతీయ సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రతినిధిగా అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోఈ పథకం కింద ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి సదస్సు జరగనుంది. ఇందులో కలెక్టర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
Similar News
News July 10, 2025
కావలి: గోడ కూలి బేల్దారి మృతి

కావలిలో గోడ కూలి బేల్దారి మృతి చెందాడు. డ్రైనేజీ కాలువ నిర్మించేందుకు తవ్వుతుండగా పక్కనేఉన్న గోడ కూలి మృతి చెందాడు. మృతుడు బోగోలు మండలం సాంబశివపురం తాతా వెంకయ్యగా గ్రామస్థులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బేల్దారి మేస్త్రిలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
News July 10, 2025
కాలనీలకు మౌలిక సదుపాయాలు అవసరం: జగిత్యాల ఎమ్మెల్యే

జగిత్యాలలోని ఇందిరమ్మ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్బన్ హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన అవసరమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు,వీధి దీపాల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. వార్డు అధికారులకు కార్యాలయ సదుపాయం కల్పించాలని, రెవెన్యూ శాఖ వారితో కలిసి పనిచేయాలని సూచించారు. నూతన నిర్మాణాలు చట్టబద్ధ అనుమతులతోనే జరగాలని, వాయిదా పడిన పనులు పర్యవేక్షణలో ఉండాలన్నారు.
News July 10, 2025
మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న భారీ వరద

మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఉదయం 3 లక్షల క్యూసెక్కులుగా ఉన్న నీరు సాయంత్రం వరకు 6.9 లక్షల క్యూసెక్కులుగా చేరుకుంది. వచ్చిన నీరును 85 గేట్లు ఓపెన్ చేసి అధికారులు గోదావరి నదికి వదులుతున్నారు. ప్రాణహిత నది నుంచి రాత్రి వరకు మరింత నీరు రానున్నట్లు తెలిపారు. బ్యారేజ్ వద్ద పోలీసులు 24 గంటలు గస్తీ కాస్తున్నారు.