News May 25, 2024

తంగళ్లపల్లి: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్లో శుక్రవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చల్ల నర్సయ్య(53) ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం రూ.8 లక్షలు అప్పు చేశాడు. అప్పు భారం పెరగడంతో ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో శుక్రవారం ఇంటి ఎదుట ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 24, 2025

కరీంనగర్: ‘ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరగాలి’

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి, సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. కనీసం 80శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చూడాలన్నారు. ఆర్.బి.ఎస్.కె పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. గర్భిణుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News December 24, 2025

కొత్తకొండ వీరభద్రస్వామి జాతర తేదీలు ఇవే

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి ఆలయంలో 2026 సం.నికి సంబంధించిన బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జనవరి 10న వీరభద్ర స్వామి కళ్యాణం, 14న భోగి పండుగ, 15న బండ్ల తిరుగుట(సంక్రాంతి) కార్యక్రమాలు జరుగనున్నాయి. జనవరి 18న అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

News December 24, 2025

KNR: ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

image

స్థానిక అంబేడ్కర్ హాకీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్ ప్రసాదరావు వెల్లడించారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.