News September 22, 2025
తంగళ్ళపల్లి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

తంగళ్లపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ముగ్గురికి గాయాలయ్యాయని SI ఉపేంద్ర చారి తెలిపారు. HYD నుంచి KRTLకు వెళ్తున్న గుద్దేటి శ్రీధర్(46), అతని భార్య సునీత ప్రయాణిస్తున్న కారును, మనోహర్ రెడ్డి అనే వ్యక్తి నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీతతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన మనోహర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
Similar News
News September 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 23, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 23, 2025
మెదక్: ‘అధిక యూరియాతో పంటలకు తెగుళ్లు’

మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. సోమవారం నర్సాపూర్లోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద యూరియా సరఫరాను ఆయన పరిశీలించారు. అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి, ఖర్చులు పెరిగిపోతాయని, రాబడి తగ్గుతుందని రైతులకు వివరించారు.
News September 23, 2025
నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో విరిగిన కుర్చీలు..

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కూడా ఉండడం లేదు. రోగులు, వారి అటెండర్లు కూర్చునేందుకు కుర్చీలు సైతం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయి, నిరుపయోగంగా ఉన్నాయి. ఆసుపత్రి ఓపీ బ్లాక్లో నడిచే మార్గంలో ఉన్న చాలా కుర్చీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. విరిగిన కుర్చీలకు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.