News August 21, 2024

తండ్రి రాజకీయ బాటలో తనయుడు

image

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి రాజకీయ బాటలో ఆయన తనయుడు అమిత్‌రెడ్డి పయనిస్తున్నారు. ప్రభుత్వం అమిత్‌రెడ్డిని తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ సంస్థకు ఛైర్మన్‌గా నియమించింది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌‌ టీడీపీప్రభుత్వంలో గుత్తా ఇదే పదవిని నిర్వహించారు. ప్రస్తుతం అదే పదవి అమిత్‌ను వరించింది. ఈ పదవిని సుఖేందర్‌రెడ్డి నిర్వహించిన వయసులోనే అమిత్‌రెడ్డికి దక్కడం గమనార్హం.

Similar News

News November 10, 2025

నల్గొండ: రూ.549కే రూ.10 లక్షల బీమా

image

నల్గొండ డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 18 నుంచి 65 సం.ల వారికి అత్యంత తక్కువ ప్రీమియంతో గ్రూప్ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సభవింస్తే కేవలం రూ.549 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కవరేజ్ పొందే విధంగా ప్లాన్ తెచ్చింది. ఈ అవకాశం IPPB ఖాతాదారులకు మాత్రమేనని, వివరాల కోసం పోస్టాఫీసును సంప్రదించాలని అధికారులు కోరారు.

News November 10, 2025

NLG: ఆయకట్టులో జోరుగా వరి కోతలు

image

నాగార్జునసాగర్ నాన్ ఆయకట్టు, ఆయకట్టు పరిధిలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1.26 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతులకు పంటచేతికి వచ్చే సమయంలో ఒక పక్క అకాల వర్షం వెంటాడుతుండగా.. మరో పక్క కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవూర, హాలియా, నిడమనూరు మండలాల్లో కూలీల కొరత మరింత ఎక్కువగా ఉంది.

News November 9, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ నల్గొండ : హైవే విస్తరణ… అభివృద్ధికి కొత్త మార్గం
→ నల్గొండ : కూరగాయలు కొనేటట్లు లేదు..!
→ నల్గొండ : ఇక్కడి నాయకులంతా అక్కడే…!
→ చిట్యాల : గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా?
→ నల్గొండ : బోగస్ ఓట్లకు చెక్
→ నేరేడుచర్ల : గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం
→ నార్కట్ పల్లి : చెర్వుగట్టుకి పోటెత్తిన భక్తులు