News May 18, 2024

తంబళ్లపల్లెలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

సెలవుల్లో ఊరికి పంపలేదని ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన తంబళ్లపల్లెలో చోటుచేసుకుంది. మండలంలోని బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు బి.శ్రీరాములు(15) కురబలకోటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో వాల్మీకి పురంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని కోరగా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

Similar News

News November 6, 2025

దూడపై చిరుతపులి దాడి.?

image

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 5, 2025

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జట్టు ఇదే..!

image

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక సదుంలో బుధవారం జరిగింది. ధరణీధర, బాలాజీ, భరత్ కుమార్, మహేంద్ర, సుధీర్(సదుం), వెంకటేశ్, ప్రసన్నకుమార్, ప్రిన్స్ (నిండ్ర), సతీష్(పలమనేరు), హర్షవర్ధన్(ఏఎన్ కుంట), నిఖిల్(దిగువమాఘం), ప్రవీణ్ కుమార్ (చిత్తూరు), సుశీల్ (సిద్ధంపల్లె), గోకుల్(అరగొండ), ప్రవీణ్ కుమార్ నాయక్(పీలేరు) ఎంపికైనట్లు నిర్వాహకులు చెప్పారు.

News November 5, 2025

తిరువన్నామలైలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలైకు బుధవారం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట వైసీపీ చిత్తూరు ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి ఉన్నారు.