News February 13, 2025

త‌క్కువ వ్య‌యంతో అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్

image

రైతులు అధిక దిగుబ‌డుల‌తో పాటు మెరుగైన ఆదాయాలు పొందాల‌నే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తున్నామని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ జ‌గ్గ‌య్య‌పేట మండ‌లంలో ప‌ర్య‌టించి, క్షేత్ర‌స్థాయిలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు. సాగులో ఉన్న పంట‌లు, ఉప‌యోగిస్తున్న ఎరువులు, వాటి ల‌భ్య‌త త‌దిత‌ర వివ‌రాల‌ను రైతుల‌ను అడిగారు.

Similar News

News November 10, 2025

VKB: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

image

ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరచాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు. సాధారణ పరిశీలనలో భాగంగా పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

News November 10, 2025

JGTL: 80లక్షల MTల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యం

image

వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో 80 లక్షల MTల అంచనాతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. పంట కొనుగోళ్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం రైతులకు కమిట్మెంట్ ఇచ్చిందని, దానికనుగుణంగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.

News November 10, 2025

తెలంగాణ న్యూస్

image

✦ దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంద‌న్న CM రేవంత్.. రేపు మౌలానా జయంతి సందర్భంగా స్మరించుకున్న CM
✦ 2026 చివరి నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
✦ ఈనెల 17, 18 తేదీల్లో HYD సమీపంలోని తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. <>దరఖాస్తుకు<<>> ఈ నెల 15వరకు గడువు