News February 19, 2026
తగ్గిన చింతపండు ధరలు

రాయదుర్గం మార్కెట్ యార్డుకు బుధవారం 232.5 క్వింటాళ్ల చింతపండు వచ్చినట్లు కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన చింతపండులో క్వింటా ఫ్లవర్ రకం గరిష్ఠంగా రూ.10,200, కనిష్ఠంగా రూ.5,500 పలికింది. కరిపులి రకం గరిష్ఠంగా రూ.16,300, కనిష్ఠంగా రూ.13,000 ధర పలికినట్లు వెల్లడించారు. ప్రతి బుధవారం మార్కెట్లో చింతపండు విక్రయాలు జరుగుతాయని ఆయన వివరించారు.
Similar News
News February 21, 2026
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
News February 21, 2026
జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, రేపే చివరి తేదీ

జగిత్యాలలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. బ్యాంకింగ్, RRB, SSC తదితర పోటీ పరీక్షలకు ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నోట్బుక్స్, పాకెట్ మనీతో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు http://tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 6303554770లో సంప్రదించవచ్చు.
News February 21, 2026
10% గ్లోబల్ టారిఫ్తో లాభమా? నష్టమా?

ట్రంప్ విధించిన 10% గ్లోబల్ <<19198500>>టారిఫ్పై<<>> ఆర్థిక నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీనివల్ల స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. కానీ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఎదురుదాడికి దిగితే వ్యాపారాలు దెబ్బతినవచ్చంటున్నారు. ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.


