News March 29, 2025

తగ్గిన యాదాద్రిశుని నిత్య ఆదాయం

image

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా శుక్రవారం 1,240 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.62,000, ప్రసాద విక్రయాలు రూ. 6,57,860, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.86,700, ప్రధాన బుకింగ్ రూ.84,650, కార్ పార్కింగ్ రూ.1,72,500, వ్రతాలు రూ.63,200, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.14,49,694 ఆదాయం వచ్చినట్లు EO భాస్కర్ రావు తెలిపారు.

Similar News

News December 17, 2025

SRH మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఫైర్

image

IPL-2026 సీజన్‌కు SRH టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్‌, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.

News December 17, 2025

KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 17, 2025

శ్రీరాంపూర్: సింగరేణి ఇన్‌చార్జి సీఅండ్‌ఎండీగా కృష్ణ భాస్కర్

image

సింగరేణి సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఅండ్‌ఎండీ)గా కృష్ణ భాస్కర్ నియమితులైనట్లు సమాచారం. 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కృష్ణ భాస్కర్ ప్రస్తుతం ట్రాన్స్‌కో సీఅండ్‌ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగరేణి సీఅండ్‌ఎండీగా ఆయనను ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.