News March 20, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.1,08,700, VIP దర్శనాలు రూ.60,000, బ్రేక్ దర్శనాలు రూ.83,700 ప్రసాద విక్రయాలు రూ.6,23,920, కళ్యాణకట్ట రూ.40,000, అన్నదాన విరాళాలు రూ.25,879, సువర్ణ పుష్పార్చన రూ.32,549, కార్ పార్కింగ్ రూ.2,10,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.14,05,339 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
Similar News
News February 21, 2026
కోదాడ: గడ్డి మిషన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు (23) ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి వివరాల ప్రకారం.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈనెల 9న నాగరాజు విషం తాగాడు. మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News February 21, 2026
ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://angrau.ac.in/
News February 21, 2026
చర్మానికి బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్కి వెళ్లి చాలామంది స్కిన్కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.


