News November 3, 2025
తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.
Similar News
News November 3, 2025
చెత్త పనులు చేయడం వైసీపీకి పరిపాటిగా మారింది: మంత్రి లోకేశ్

AP: డ్రగ్స్ సరఫరా చేస్తున్న YCP స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘డ్రగ్స్ వద్దని ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే YCP పాత వాసనలు వదులుకోవట్లేదు. చెత్త పనులు చేయడం, రాష్ట్రంలో ఏదో అయిపోతుందంటూ హడావుడి చేయడం పరిపాటిగా మారింది. YCP ఫేక్ పార్టీ అని అనేది అందుకే. ఆ పార్టీ నడిపేది స్టూడెంట్ వింగ్ కాదు, డ్రగ్స్ వింగ్’ అని ఆరోపించారు.
News November 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 55 సమాధానాలు

1. అయోధ్య నగరాన్ని ‘మను చక్రవర్తి’ నిర్మించారు.
2. విచిత్రవీర్యుని తండ్రి ‘శంతనుడు’.
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ‘ఏడు’ రోజులు ఎత్తి పట్టుకున్నాడు.
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలను ‘చక్రాలు’ అని అంటారు.
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని‘మోక్షం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 3, 2025
APPLY NOW: CCIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) 14 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, పీజీ(ఎకనామిక్స్), బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు రూ.60వేలు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://cci.gov.in


