News March 15, 2025
తణుకు: పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ఫొటో

తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి, స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ పిక్ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.
Similar News
News March 15, 2025
పెంటపాడు: ఐరన్ ప్లేట్ మీద పడి వ్యక్తి మృతి

బరువైన ఐరన్ ప్లేట్ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ప్రత్తిపాడులో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్(38) ఈ నెల 13న ప్రత్తిపాడులోని ఓ పేపర్ మిల్లులో ఇనుప వస్తువులు తొలగించే పని మీద వెళ్లాడు. ఆ సమయంలో మస్తాన్పై బరువైన ఇనుప ప్లేట్ పడటంతో మృతి చెందాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు విషయం ఎవరికీ తెలియరాలేదు.
News March 15, 2025
ప.గో: నెత్తురోడిన రహదారులు.. ఐదుగురు మృతి

శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టగా చిన్నారితో సహా తల్లిదండ్రులు <<15760017>>మృతి చెందారు.<<>> కృష్ణా(D) ఘంటలసాల(M) జీలగలగండిలోని హైవేపై <<15755822>>లారీని బోలెరో ఢీకొన్న<<>> ఘటనలో ప్రాతాళ్లమెరకకు చెందిన వర ప్రసాద్, శివకృష్ణ చనిపోయారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
News March 14, 2025
పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.