News January 20, 2026
తనిఖీల్లేవ్.. చర్యల్లేవ్.. అంతా సవ్యమేనా?

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు వాడాల్సిన కమర్షియల్ సిలిండర్లకు బదులుగా, తక్కువ ధరకు లభించే గృహ వినియోగ సిలిండర్లను వినియోగిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి కనీసం తనిఖీలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Similar News
News April 2, 2026
ఉమ్మడి ప.గో.లో పెరిగిన వార్డుల సంఖ్య

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో కొన్ని మున్సిపాలిటీల స్వరూపం మారనుంది.
నిడదవోలు 28 నుంచి 32
జంగారెడ్డిగూడెం 29 – 32
నరసాపురం 31- 36
ఆకివీడు 20- 28
నూజివీడు 32- 36
News April 2, 2026
నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.
News April 2, 2026
వికారాబాద్: రూ.200.. ఇంటర్ అడ్మిషన్లు

వికారాబాద్, కొడంగల్, దోమ KGBVలలో వచ్చే విద్యాసంవత్సరానికి ఇంటర్ MPC, BIPC, CEC ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 15 వరకు TGRJC సైట్లో రూ.200 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలు సైట్లో చూడవచ్చు.


