News August 22, 2024
తమ్మినేని విద్యార్హతపై విచారణ జరిపించండి: MLA కూన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ను ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హత సర్టిఫికెట్లపై సీఐడితో విచారణ జరిపించాలని ఆయనకు వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హాయంలో ఫిర్యాదు చేస్తే విచారణ జరగలేదని ఆయనకు తెలిపారు. విచారణకు ఆయన సానుకులంగా స్పందించారని తెలిపారు.
Similar News
News October 7, 2024
శ్రీకాకుళంలో ఈ నెల 9న చెస్ పోటీలు
శ్రీకాకుళంలో ఈనెల 9న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు బి. కిషోర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అండర్ 15 విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 7, 2024
జిల్లాలో ఇప్పటికి 64డెంగీ కేసులు.. అప్రమత్తత అవసరం: శ్రీకాకుళం DMHO
శ్రీకాకుళం జిల్లాలో వైరల్ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం సూచించారు. శీతల గాలులు మొదలైన తర్వాత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి ఇళ్ల పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 64డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు
News October 7, 2024
ఇసుకను పొందడంలో సమస్యలా? ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
ఇసుకను పూర్తిగా ఆన్లైన్ విధానంలో కేటాయించడం జరుగుతోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఇసుకను (https://www.sand.ap.gov.in) లో బుక్ చేసుకోవచ్చన్నారు. ఇసుక పొందడంలో సమస్యలు ఎదురైతే, 24 గంటలూ పనిచేసే జిల్లా స్థాయి ఫెసిలిటేషన్ సెంటర్ను సంప్రదించాలన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 18004256012, వాట్సాప్ నెంబర్ 9701691657ను సంప్రదించవచ్చన్నారు.