News July 29, 2024

తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు పంపండి: డీఈవో1/2

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరీక్షల బోర్డు (DCCB) ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కోసం అన్ని పాఠశాలల HMలు తరగతుల వారీగా విద్యార్థుల వివరాలను పంపాలని డీఈవో డా. గోవిందరాజులు తెలిపారు. ఎస్ఏ-1, ఎస్ఏ-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారా అందజేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6-8 తరగతుల విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.

Similar News

News January 6, 2026

MBNR: మున్సిపాల్ ఎన్నికలు.. ఈనెల 10న తుది జాబితా

image

రాబోయే రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయి మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వారీగా
ఈనెల 1న ఓటర్ ముసాయిదా జాబితా ప్రచురించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలో ఈనెల 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అభ్యంతరాలు పరిష్కరించి ఈనెల 10న తుది జాబితా ప్రచురించనున్నారు.

News January 6, 2026

MBNR: ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్.. APPLY NOW

image

జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో కూడిన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి S.జరీనా బేగం తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఒక యూనిట్ కింద ముగ్గురు ట్రాన్స్‌జెండర్లను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీలోగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 6, 2026

MBNR: అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం సబ్జెక్టులు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్-ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రో కె పద్మావతి తెలిపారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు పిజీలో 55%, SC, ST అభ్యర్థులకు 50% ఉండలన్నారు. నెట్ సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.