News September 13, 2025

తలసరి ఆదాయంలో అట్టడుగున ములుగు జిల్లా..!

image

అడవుల జిల్లా ములుగు తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అట్టడుగున ఉంది. 2023-24 నివేదిక ప్రకారం రూ.1,97,639తో 25వ స్థానంలో కొనసాగుతోంది. జిల్లా ప్రజలు 90% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. ఉన్న ఒక్క బిల్ట్ ఫ్యాక్టరీ దశాబ్ధం క్రితం మూతపడింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వృద్ధిలోకి వస్తోంది. పామాయిల్ ఫ్యాక్టరీకి ఇటీవల పునాదులు పడ్డాయి.

Similar News

News September 13, 2025

హుజూర్‌నగర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

image

హుజూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి అప్పారావు గుండెపోటుతో సెప్టెంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య గెల్లి అరుణ శనివారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

News September 13, 2025

అలంపూర్‌లో భక్తుల రద్దీ

image

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం మహా నివేదన సమయంలో భక్తులు దర్శనాల కోసం వేచి చూశారు. అనంతరం హారతులు అందుకున్నారు.

News September 13, 2025

బీటెక్ అర్హత.. CRDAలో 132 ఉద్యోగాలు

image

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(AP CRDA)లో 132 ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 చివరి తేదీ. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేయనున్నారు. ఆయా విభాగాల్లో బీటెక్ పాసైన వారు అర్హులు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం <>https://crda.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.