News November 19, 2025

తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

Similar News

News April 1, 2026

ఉమ్మడి అనంత జిల్లాలో గ్యాస్ కష్టాలు: మంత్రి సవిత క్లారిటీ

image

గ్యాస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. మంగళవారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారందరికీ సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తారన్నారు. యుద్ధం నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఇబ్బందులు రాకూడదని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు.

News April 1, 2026

నేడు చర్లలో విద్యుత్తు సరఫరా నిలిపివేత

image

చర్ల మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. RWS ఫీడర్‌ పరిధిలో అత్యవసర లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఉ.9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల లక్ష్మీ కాలనీ, నాయకుల కాలనీ, ఏకలవ్య, కస్తూరిబా పాఠశాలలు, దేవానగరం, దోసిల్లపల్లి, తాలిపేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.

News April 1, 2026

సైనైడ్ వాడకాన్ని నిషేధించండి: బీజేపీ

image

తుగ్గలి మండలం జొన్నగిరి, బొల్లవాని పల్లె, పగిడిరాయి గ్రామాలలో బంగారు వెలికితీతకు ఉపయోగిస్తున్న సైనైడ్ వాడకాన్ని నిషేధించాలని బీజెపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, హేమ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముడి బంగారం శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయన పదార్థాలు వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రులు టీజీ భరత్, రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు.