News September 18, 2025

తల్లిదండ్రులకు సత్వర న్యాయం చేయాలి: జగిత్యాల కలెక్టర్

image

జగిత్యాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో దివ్యాంగుల & వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను విస్మరించే కుమారులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలన్నారు.

Similar News

News September 19, 2025

భద్రాద్రి: పాపడలా జలపాతం.. పర్యాటకుల సందడి

image

మణుగూరు సమీపంలోని రథం గుట్టపై ఉన్న ‘స్వప్న జలపాతం’ చూపరులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతున్న ఈ జలపాతం నుదుటిన పెట్టుకునే ‘పాపడబిళ్ల’లా కనిపిస్తుందని పర్యాటకులు అంటున్నారు. జలపాతాన్ని సందర్శించేందుకు అనువైన మార్గం లేదని.. ప్రభుత్వం స్పందించి రహదారి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
PC: MANUGURU_UPDATES

News September 19, 2025

పార్టీ ఫిరాయింపు.. MLA సంజయ్‌కు మళ్లీ నోటీసులు!

image

పార్టీ ఫిరాయింపుపై JGTL MLA సంజయ్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు పంపారు. BRSలోనే కొనసాగుతున్నానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే CMని కలిశానని, పార్టీ మారలేదని సంజయ్ మునుపటి నోటిసుకు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని స్పష్టమైన ఆధారాలు కావాలని కోరారు. కాగా, MLAల పార్టీ ఫిరాయింపుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.

News September 19, 2025

రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

image

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.