News August 14, 2025

తాండూరులో రైలు కింద పడి వ్యక్తి మృతి

image

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన తాండూరులో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. బుధవారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ యార్డులో ఓ వ్యక్తి (55) గుర్తుతెలియని రైలు కిందపడి చనిపోయాడు. మృతుడి చొక్కాపై శ్రీను టైలర్స్ శంకర్‌పల్లి అని రాసి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 7702629707 నంబర్‌కు కాల్ చేసి, సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News August 14, 2025

యువతిపై గ్యాంగ్‌రేప్.. 10 మంది అరెస్ట్

image

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్‌లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.

News August 14, 2025

భద్రాచల ఆలయానికి ISO గుర్తింపు

image

భద్రాచలం దేవస్థానానికి ISO గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవికి సర్టిఫికెట్‌ను ISO డైరెక్టర్ శివయ్య అందించారు. కాగా, ISO అనేది ఉత్పత్తి నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని ధ్రువీకరించే ఒక గుర్తింపు సంస్థ అని తెలిపారు.

News August 14, 2025

భద్రాచలం: సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణం

image

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. సుప్రభాతం, తోమాల సేవ అనంతరం స్వామివారి, అమ్మవారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, మంగళహారతులతో భక్తిపూర్వకంగా మారింది.