News March 19, 2025
తాండూర్: ఇంటి పన్ను వసూలు 74% జిల్లాలోని చివరి స్థానం

తాండూర్ మండల వ్యాప్తంగా 33 గ్రామపంచాయతీలో నేటి వరకు 74% ఇంటి పన్ను వసూలు అయినట్లు మండల పంచాయతీ అధికారులు తెలిపారు. 33 గ్రామపంచాయతీలో 100% కంటే తక్కువ ఇంటి పన్ను వసూలు అయిందని, మార్చి చివరి నాటికి 100% ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు ముమ్మరంగా పని చేయాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోనే చివరి స్థానంలో ఇంటి పన్ను వసూళ్లలో తాండూరు మండలం ఉంది.
Similar News
News December 17, 2025
వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.
News December 17, 2025
నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం

శివంపేట మండలంలో గోమారం సర్పంచిగా కుమ్మరి హిమవతి ఆంజనేయులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హిమవతి సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, గోమారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం.
News December 17, 2025
భద్రాద్రి: అన్నపై సర్పంచిగా గెలిచిన తమ్ముడు

జూలూరుపాడు మండలం కొత్తూరు పంచాయతీ ఎన్నికలు రాజకీయంగానే కాకుండా, కుటుంబపరంగానూ ఆసక్తి రేకెత్తించాయి. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం సాక్షాత్తూ అన్నదమ్ములైన అక్కుల రాములు(CPI), అక్కుల నరసింహారావు(కాంగ్రెస్) ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో అన్న రాములుపై తమ్ముడు నరసింహారావు 26 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. రక్త సంబంధీకుల మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.


