News April 15, 2025

తాండూర్: పైలెట్ రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

వరంగల్‌లో జరుగనున్న రజతోత్సవ మహాసభకు జాతరలా తరలివచ్చి సక్సెస్‌ చేద్దామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తాండూరులోని ఆయన నివాసంలో తాండూరు పట్టణ బీఆర్‌ఎస్‌ నేతలతో మీటింగ్‌ నిర్వహించారు. త్వరలో రానున్నది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 18, 2026

మదనపల్లె: ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!

image

అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ఆదేశించారు. పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. 50 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 28,550 మంది హాజరవుతారని చెప్పారు. CC కెమెరాలు, వైద్య శిబిరాలు, పోలీస్ బందోబస్తు, తాగునీరు, మరుగుదొడ్లు, RTC బస్సులు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే 9866112750కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News February 18, 2026

EC.. తుగ్లక్ కమిషన్: మమతా బెనర్జీ

image

ఎన్నికల సంఘం ఓ తుగ్లక్ కమిషన్ అని బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. ‘BJP ఐటీ సెల్ కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లను AI ద్వారా తొలగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా EC ధిక్కరిస్తోంది’ అని విమర్శించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని, వారిని టెర్రరిస్టుల్లా చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

News February 18, 2026

CM రిక్వెస్ట్.. కుప్పంలో 2 ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌

image

CM చంద్రబాబు రిక్వెస్ట్ నేపథ్యంలో కుప్పంలో 2 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 10న CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కుప్పంలో వాస్కోడగామా-వేలంకణి, దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 రైళ్ల స్టాపింగ్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రమంత్రి CM చంద్రబాబుకు లేఖ రాశారు.