News January 2, 2026
తాండూర్: ముగ్గు వేస్తున్న మహిళపై వీధి కుక్క దాడి

తాండూర్ మండలం రేచినిలోని పోచమ్మవాడకు చెందిన మామిడి రాజేశ్వరిపై శుక్రవారం వీధి కుక్క దాడి చేసింది. ఉదయం ఇంటి ముందు రాజేశ్వరి ముగ్గు వేస్తున్న సమయంలో కుక్క దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు. మహిళను చికిత్స నిమిత్తం108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News January 2, 2026
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జనవరి 1 నుండి 31 వరకు ‘ఆపరేషన్ స్మైల్-XII’ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు సబ్ డివిజన్లలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కలిగించాలని ఆదేశించారు.
News January 2, 2026
సూర్యాపేట: రాజకీయ కక్షలతో వేధిస్తున్నారు: మత్స్యకారులు

మూడు దశాబ్దాలుగా చింతపాలెం మండలం పులిచింతల నదిని నమ్ముకుని జీవిస్తున్న తమను ఆంధ్రకు వెళ్లాలంటూ వేధిస్తున్నారని రేబల్లె మత్స్యకారులు కలెక్టరేట్లో మొరపెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొందరు కుట్రపూరితంగా తమ లైసెన్సులపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తమ పొట్ట కొట్టవద్దని, అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
News January 2, 2026
జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.


