News March 5, 2025

తాగునీటిపై ఒక్క ఫిర్యాదు కూడా రాకూడ‌దు: కలెక్టర్  

image

జిల్లాలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఈనెల 15 నాటికి 100 శాతం తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాలూ క్రియాశీలం కావాల‌ని అన్నారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, వివిధ అధికారుల‌తో ఆయన టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 

Similar News

News July 5, 2025

ముమ్మిడివరం: బైపాస్ రోడ్డు వద్ద కాలువలో మృతదేహం

image

ముమ్మిడివరం కాశివాని తూము సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. నిక్కరు షర్టు వేసుకుని సుమారు 50 సంవత్సరాలు పైబడిన పురుషుని మృతదేహంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

News July 5, 2025

రాజేంద్రనగర్: 8 నుంచి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్‌ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.

News July 5, 2025

HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

image

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.