News March 17, 2025
తాగునీటి సమస్యపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఆర్డీవోలు నీటి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి తాగునీరు, వడగాల్పులు, పి-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు.
Similar News
News July 7, 2025
పెద్దపల్లి యువతకు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ అవకాశం

పెద్దపల్లిలో జిల్లాలో ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ తెలిపింది.. ఈ కోర్సులకు జ్యోతినగర్, NTPC, GDKలో ఈ శిక్షణ ఇస్తారు. INTER పాసైన యువత దీనికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 8లోపు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం, గది నం.114లో దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు https://peddapalli.telangana.gov.in చూడవచ్చు
News July 7, 2025
కామారెడ్డి జిల్లాలో 4 పాఠశాలలు రీ ఓపెన్

కామారెడ్డి జిల్లాలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభించేందు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జీరో ఎన్రోల్మెంట్తో పాటు పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడంతో పాఠశాలలను మూసివేశారు. బిక్కనూర్(M) మోటాట్పల్లి, జుక్కల్(M)మధురతండా, మాచారెడ్డి(M) నెమ్లిగుట్టతండా, సదాశివనగర్(M) దగ్గిలో మంగళవారం పాఠశాలలను రీ ఓపెన్ చేయనున్నారు.
News July 7, 2025
శాకాంబరీ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకాంబరీ మహోత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ద్వాదశి తిథి సోమవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.