News February 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా, డివిజన్ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలను ముందస్తు ప్రణాళికలతో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.
Similar News
News February 28, 2026
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త!

AP: ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని APSDMA తెలిపింది. సెంట్రల్ ఆంధ్రలో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీస్తాయంది. ఎండతీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు క్యాప్, కర్చీఫ్, తెలుపు రంగు వస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పింది. అలాగే వేసవి తాపం తగ్గించుకోవడానికి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలని సూచించింది.
News February 28, 2026
NRPT: మార్చి 2న జాబ్ మేళా

నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 2న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత శనివారం ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు కలశాల ప్రిన్సిపల్ను సంప్రదించాలని చెప్పారు. ఏడుకు పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని అన్నారు.
News February 28, 2026
వేట్లపాలెం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ బాధితులకు రూ. 50 వేల చొప్పున పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషాద సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


