News February 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా, డివిజన్ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలను ముందస్తు ప్రణాళికలతో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.
Similar News
News November 10, 2025
VKB: కళ్లముందే కదలాడుతున్నాయి

చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగి నేటికి వారమవుతున్నా ప్రజల మనసుల్లో ఇంకా ఆ దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఓ ప్రశ్న మాత్రం ఇంకా అందరి నోటా వినిపిస్తోంది. ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు..? రోడ్డును బాగు చేయక వదిలేసిన రాజకీయ నాయకులా..? రోడ్డు విస్తరణకు అడ్డుగా నిలిచిన పర్యావరణ ప్రేమికులా..? రీజన్ ఏదైనా రహదారి విస్తరణ జరిగుంటే ఇలా అయ్యేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News November 10, 2025
అంచనాలు పెంచేసిన ‘ఉస్తాద్’ టీమ్

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మీసాల పిల్ల(మన శంకర వరప్రసాద్ గారు), చికిరి(పెద్ది) పాటలు హిట్టవడంతో ఇక ‘ఉస్తాద్’ అప్డేటే మిగిలిందని అభిమానులు SMలో పోస్టులు చేస్తున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. ‘అదే పనిలో ఉన్నాం. మీ అంచనాలను ఎక్కువగానే పెట్టుకోండి’ అని రాసుకొచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News November 10, 2025
14, 15 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జరగనున్నాయి. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా క్యాడర్ అంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆక్వా సంఘం నాయకులు బి. బలరాం తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.


