News February 4, 2025

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: పెద్దారెడ్డి

image

తనను తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ తనను వెళ్లనివ్వట్లేదని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలను సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎక్కడా అడ్డుకోవడం లేదని తెలిపారు. జేసీ కారణంగా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని విమర్శించారు.

Similar News

News February 4, 2025

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News February 4, 2025

నెల్లూరు:ల్యాబ్ టెక్నీషియన్ల సమీక్షా సమావేశం

image

అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్‌లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్‌లు పాల్గొన్నారు.

News February 4, 2025

తిరుపతి SVU దగ్గర 144 సెక్షన్

image

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికారులకు సవాల్‌గా మారింది. నిన్ననే ఎన్నిక జరగాల్సి ఉండగా.. కోరం లేక వాయిదా పడింది. తమ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేశారంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. కార్పొరేటర్ల బస్సుకు భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరికాసేపట్లో ఎస్వీయూ దగ్గరకు కార్పొరేటర్లు రానున్నారు. ఈ నేపథ్యంలో SVU దగ్గర 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు.

error: Content is protected !!