News March 5, 2025
తాడేపల్లిగూడెం: అతఃపాతాళంలో ఇది ఆరంభం మాత్రమే

పవన్ కళ్యాణ్ని ఏదోకటి విమర్శిస్తేనే కానీ జగన్ని ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పట్టించుకొనే పరిస్థితి లేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుుధవారం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రజలు ఇవ్వని ‘ప్రతిపక్ష హోదా’ని అడుక్కోవడం ఏంటని ప్రశ్నించారు.
Similar News
News March 6, 2025
పెదపాడు: సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై లైంగిక దాడి

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తె(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పెదపాడు మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శారద సతీశ్ వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయి ఇద్దరు కుమార్తెలతో ఉంటున్న మహిళ నాని అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన పెద్ద కుమార్తెపై ఇటీవల నాని లైంగిక దాడికి పాల్పడ్డాడన్న మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News March 6, 2025
భయం లేకుండా చికెన్ తినండి: కలెక్టర్

ప.గో జిల్లా ప్రజలు ఎలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం తణుకులో నిర్వహించిన చికెన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. దాదాపు 10 వేల మందికి ఉచితంగా అందిచారు. ఫౌల్ట్రీ రైతులను రుణాల రీషెడ్యూల్కు ప్రయత్నిస్తామని కలెక్టర్, MLA రాధాకృష్ణ తెలిపారు. వేల్పూరు కృష్ణానందం కోళ్లఫారం, పెదతాడేపల్లిలో రామలక్ష్మి ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లా మొత్తం చికెన్ తినొచ్చన్నారు.
News March 6, 2025
సిద్ధాంతం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సిద్ధాంతం అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధాంతం చెరువుపేటకు చెందిన పమ్మి చినబాబు (30)మృతి చెందాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టాడంతో తలకు బలమైన గాయం అవ్వగా ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.