News January 3, 2026
తాడేపల్లి నుంచే మళ్లీ జనంలోకి YS జగన్.?

2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధినేత YS జగన్ తాడేపల్లి నుంచే మళ్లీ జనంలోకి వెళ్లే వ్యూహానికి తెరలేపుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో ‘జనంలో ఉండటమే బలం’ అనే నమ్మకంతో పనిచేసిన జగన్, అదే ఫార్ములాను తిరిగి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. పరామర్శలు, వివాహాల పేరుతో సాగుతున్న పర్యటనలు, అనూహ్యంగా రోడ్షోలుగా మారుతున్న నేపథ్యంలో తాడేపల్లి రాజకీయాలకు ప్రాధాన్యత పెరిగింది.
Similar News
News January 7, 2026
మైలవరం: వేరు వేరు చోట ఇద్దరు ఆత్మహత్య

మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 7, 2026
HYD: టెక్నికల్ స్కిల్స్తోనే భవిష్యత్

టెక్నాలజీతో ప్రపంచం పరుగులు తీస్తుందని HYD టెక్నిపుణులు సురేంద్ర సింగ్ తెలిపారు. హైటెక్ సిటీ, T-HUB, KPHBలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ స్ట్రాట అంశాలపై జరిగిన ప్రత్యేక కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత యువత టెక్నికల్ స్కిల్స్, సాప్ట్వేర్ స్కిల్స్ పెంచుకోవడంతో పాటు నిత్యం అభ్యాసన చేయాలని సూచించారు.
News January 7, 2026
NLG: సన్న బియ్యం.. క్వాలిటీ పట్టించుకోవట్లే!

ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్నబియ్యం నాణ్యత క్రమక్రమంగా తగ్గుతుంది. గత మూడు నాలుగు నెలల నుంచి సన్నబియ్యంలో అధికంగా నూకలు, తౌడు, మెరిగెలు, రాళ్లు వస్తుండడంతో పాటు ముక్క వాసన వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11,54,178 రేషన్ కార్డులు ఉండగా.. 22,132 టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంది. వీటిని తినడానికి 40 శాతం పైగానే మంది ఆసక్తి కనబరచడం లేదు.


