News August 23, 2025
తాడ్వాయి: కనుమరుగైన మంచెలు

వ్యవసాయ బావుల వద్ద మంచెలు కనుమరుగయ్యాయి. గత 20 ఏళ్ల క్రితం వ్యవసాయ బావుల వద్ద రైతులు కట్టెలతో మంచెలు వేసుకొని సాగుచేసిన పంటలకు కాపలా కాసేవారు. అంతేకాకుండా క్రిమి కీటకాల నుంచి రక్షణగా మంచెలు ఉండేవి. కాపలా అనంతరం మంచెపై కూర్చుని భోజనం చేసి రైతులు సేద తీరేవారు. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు రైతులకు వ్యవసాయ బావుల వద్ద లేకుండా పోయింది. మంచెల గురించి పలువురు రైతులు గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు.
Similar News
News August 23, 2025
ఆదాయం తగ్గి అప్పులు పెరుగుతున్నాయి: జగన్

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని మాజీ CM జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరుగులు పెట్టిస్తామన్నారు. కానీ, 2024-25లో ప్రభుత్వ ఆదాయం(ట్యాక్స్, నాన్-ట్యాక్స్) ఇయర్లీ గ్రోత్ కేవలం 3.08% మాత్రమే. అప్పులు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదేళ్లలో మేము రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. ఈ 14 నెలల్లోనే రూ.1,86,361 కోట్ల అప్పు చేశారు’ అని విమర్శించారు.
News August 23, 2025
రేపు వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సోమిరెడ్డి

గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News August 23, 2025
GNT: మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు

పనితీరు, ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. 1 స్థానంలో నిమ్మల రామానాయుడు, 2 స్థానంలో నారా లోకేశ్, 3 స్థానంలో సత్యకుమార్ యాదవ్, 4 స్థానంలో అనిత, 5 స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మొదటి ఐదు స్థానాలలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండటంతో గుంటూరు జిల్లా అత్యుత్తమ స్థానంలో స్థానంలో నిలిచింది.