News March 19, 2025
తానా మహాసభలకు మంత్రి సవితకు ఆహ్వానం

అమెరికాలోని మిచిగన్లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు మంత్రి ఎస్. సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడ్రోజులపాటు, తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
తలరాతను మార్చే క్రమంలో చిగురించిన ప్రేమ..!

బిహార్లో సినిమా కథను తలపించే ఘటన జరిగింది. రైళ్లలో యాచిస్తున్న అనాథ బాలికను చూసి ఒక యువకుడు చలించిపోయాడు. ఆమె తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో శ్రమించి ఆమె కుటుంబ మూలాలను కనుగొని విడిపోయిన వారికి దగ్గర చేశాడు. మానవత్వంతో మొదలైన ఈ ప్రయాణంలో వారి మధ్య పెరిగిన విశ్వాసం ప్రేమగా మారింది. రైల్వే ప్లాట్ఫారమ్ నుంచి మొదలైన వారి ప్రయాణం తాజాగా వివాహ బంధంగా మారి ముందుకు సాగుతోంది.
News December 10, 2025
వరంగల్ ఓటర్లూ.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

ఉమ్మడి WGLలో రేపు మొదటి విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు కాల్ చేసి అలెర్ట్ చేస్తున్నారు. ఛార్జీలు పంపించాం, నేటి రాత్రికే ఇంటికి రావాలని మెసేజ్లు పెడుతున్నారు. కుటుంబీకులకు సైతం కాల్స్ చేసి మీపిల్లలను రమ్మని చెప్పాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలువురు ఓటర్లకు డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
News December 10, 2025
స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో రేపు(గురువారం) నిర్వహించనున్న మొదటి విడత పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వినియోగించుకోవాలన్నారు. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.


