News March 27, 2025

తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యత

image

రాష్ట్ర మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యతను అప్పగించింది. ‘పార్టీ క్రమ శిక్షణ కమిటీ’లో సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ బుధవారం వైసీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో శెట్టిపల్లి రఘురామి రెడ్డి, రెడ్డి శాంతి, కైలే అనీల్ కుమార్, విశ్వేశ్వర రెడ్డిలు ఉన్నారు.

Similar News

News March 30, 2025

రాజమండ్రి: రహదారుల అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

image

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ.25 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో అత్యవసరమైన పనుల ప్రతిపాదనల జాబితాను శనివారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి అందజేశారు. పంచాయతీరాజ్ పరిధిలో గల గ్రామీణ రోడ్లలో అధ్వానంగా ఉన్న వాటిని అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఆయన కోరారు.

News March 30, 2025

రాజమండ్రి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రశాంతి

image

శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల కలయికతో ఉగాది పండుగ రోజు తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. షడ్రుచులుల కలయికతో కూడిన మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువుగా అనగా కారం, తిక్ అనగా చేదు, కషాయం, వగరులతో కలిసి ఉగాది అని అన్నారు.

News March 29, 2025

సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను అభివృద్ది చేయాలి: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులకు సంబంధించిన పనులు నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను హేతుబద్ధీకరణ విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు.

error: Content is protected !!