News July 20, 2024
తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో నూతన వసతులు ప్రారంభించిన మంత్రి

తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్టీసీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు.
Similar News
News August 21, 2025
రేపు ఆమనగల్లు బంద్

ఆమనగల్లుకు కొందరు నార్త్ ఇండియా నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండటంతో స్థానికులకు ఉపాధి లభించట్లేదంటున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రేపు ఆమనగల్లు బంద్కు స్థానిక వ్యాపారులు పిలుపునిచ్చారు.
News August 21, 2025
HYD: నేటి నుంచి ప్రత్యేక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

GHMCలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించనున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. వాతావరణశాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉండడంతో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాల తొలగింపునకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
News August 20, 2025
కొందుర్గు: కలెక్టర్కు లేఖ రాసిన విద్యార్థులు

కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు లేఖ రాశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లారని, దీంతో తమ పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్ను తమ పాఠశాలకు పంపించాలని విద్యార్థులు కోరారు.