News December 20, 2025

తాళ్లపాలెం: స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం

image

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసింకోట మండలం తాళ్లపాలెంలో కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్లు, గోబర్ దన్ ప్లాంట్, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

Similar News

News December 21, 2025

KMR: నకిలీ నోట్ల ముఠాపై పిడి యాక్ట్.. ఎస్పీ ఉక్కుపాదం

image

కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నకిలీ కరెన్సీ చలామణికి పాల్పడుతున్న ముఠాలోని మరో ఇద్దరు కీలక నిందితులపై PDయాక్ట్ అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి టౌన్ పరిధిలోని ఒక వైన్స్ షాపులో నకిలీ రూ.500 నోట్లను మార్చే క్రమంలో ఈ ముఠా గుట్టురట్టయింది.

News December 21, 2025

మెదక్: కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక

image

మెదక్ జిల్లా స్థాయి కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక గుల్షన్ క్లబ్ ఆవరణలో నిర్వహించారు. 50 మంది పురుషులు, 40 మంది మహిళలు ఎంపిక ప్రక్రియలో పాల్గొనగా 14 మంది చొప్పున ఎంపిక చేశారు. ఈనెల 25 నుండి కరీంనగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు, ప్రభు పాల్గొన్నారు.

News December 21, 2025

కామారెడ్డి: ఫుడ్ సేఫ్టీపై రెజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా

image

కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 22న ఆహార భద్రత రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు డెసిగ్నేటెడ్ అధికారి శిరీష తెలిపారు. ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో తగిన పత్రాలతో ఈ మేళాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆమె హెచ్చరించారు.