News January 27, 2025

తాళ్లరేవు: చనిపోయి మరో ఇద్దరికి చూపునిచ్చిన మహిళ

image

ప్రముఖ దినపత్రికలో తాళ్లరేవు మండల విలేకరిగా వూడా వెంకటరమణ పనిచేస్తున్నారు. ఆయన సతీమణి హేమవతి(45) ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు వెంకటరమణ తన శ్రీమతి నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానమిచ్చారు. చనిపోయి ఆమె ఇద్దరికి చూపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అభినందించారు. సతీ వియోగంతో బాధపడుతున్న విలేకరి వెంకటరమణను తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు.

Similar News

News November 11, 2025

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. టార్గెట్ DEC 2026

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. టార్గెట్ డిసెంబర్ 2026 అని GM సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ తెలిపారు. అందుకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచి ముందుకు వెళుతున్నట్లు వివరించారు. రూ.714 కోట్లతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం వెయిటింగ్ హాల్ నిర్మాణాలు, లాంగ్ స్పేస్, ఆర్కేడ్ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి.

News November 11, 2025

బయో-కెమికల్ వార్: ఉగ్రసంస్థల కొత్త వ్యూహం

image

భారత్‌పై విషం చిమ్మేందుకు ఉగ్రసంస్థలు రూటు మార్చాయి. నిఘా, తనిఖీలు, సప్లై తదితర సవాళ్లు పెరగడంతో స్థానిక పదార్థాలతో నరమేధం సృష్టించే నైపుణ్యం గల వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. రసాయనాలు, వాటితో మంచి చెడులు వైద్యులకు తెలియడంతో వారినే పావులుగా మారుస్తున్నాయి. ఆముదాలతో రెసిన్ విషం తయారుచేస్తూ పట్టుబడ్డ HYD Dr. మొయిన్, ఫరీదాబాద్‌లో అమ్మోనియం నైట్రేట్ యూరియాతో దొరికిన ముగ్గురు వైద్యులు ఇందుకు ఉదాహరణ.

News November 11, 2025

ప్రమాదం.. వ్యక్తిని కాపాడిన స్మార్ట్ వాచ్

image

మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు స్మార్ట్ వాచ్ ఎలా సహాయపడుతుందో తెలిపే ఘటనే ఇది. ఓ వ్యక్తికి తీవ్ర ప్రమాదం జరిగినప్పుడు అతడి చేతికి ఆపిల్ వాచ్ ఉంది. BP, పల్స్ పడిపోవడాన్ని వాచ్ గ్రహించి ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసింది. అతడి లొకేషన్‌ను కొడుకుకు & అంబులెన్స్‌కు హెచ్చరిక సందేశాన్ని పంపింది. బాధితుడు క్షేమంగా బయటపడ్డారు. అత్యవసర SOS ఫీచర్‌లు యాపిల్‌తో పాటు Samsung & Google Pixel వాచ్‌ల్లోనూ ఉన్నాయి.