News August 26, 2025

తాళ్లరేవు: స్నేహితుల మధ్య ఘర్షణ.. వ్యక్తి హత్య

image

తాళ్లరేవు(M) కోరంగి పీఎస్ పరిధిలో మంగళవారం యానాంకిపాలెపు శ్రీను(45) హత్యకు గురయ్యాడు. శ్రీను, అతడి స్నేహితుడికి మధ్య సెల్ఫోన్ విషయంలో మురళీనగర్ వద్ద ఘర్షణ జరిగింది. శ్రీనుని అతని స్నేహితుడు తలపై రాయితో మోది చంపాడు. అనంతరం ఇసుక గుట్టలో మృతుడి తలను కప్పేసి పరారయ్యాడు. గస్తీలో ఉన్న యానాం ఎస్సై పునీత్ రాజ్ కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

Similar News

News August 27, 2025

VKB: విత్తన గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

image

విత్తన గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామని మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్‌లోని ఎన్ఎస్‌పీ కార్యాలయంలో ఆయన విత్తన గణపతి విగ్రహాలను మంగళవారం పంపిణీ చేశారు. గణపతి భక్తితో పాటుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విత్తన గణపతిని నీటిలో నిమజ్జనం చేయడంతో అది మొక్కగా పెరిగి సమాజానికి నీడను ఇస్తుంద తెలిపారు.

News August 27, 2025

ఖైరతాబాద్ గణేశుడి పూర్తి రూపం

image

TG: వినాయక నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. ఇవాళ ఆయన తొలి ఫొటో బయటకు వచ్చింది. ఇన్ని రోజులు నిర్మాణ దశలో కర్రలు ఉండగా ఇప్పుడు వాటిని తొలగించి స్వామివారి రూపాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మహాగణపతి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా పూజలందుకోనున్నారు. 69 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడి దర్శనానికి లక్షలాది మంది తరలిరానున్నారు.

News August 27, 2025

కరీంనగర్: పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలో కొత్తగా మంజూరైన 22 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 22 మహిళా బోధకులు, 22 మహిళా ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని తెలిపారు. బోధకులకు ఇంటర్, ఆయాలకు 7వ తరగతి అర్హత అని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 28న దరఖాస్తులను కరీంనగర్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు.